Friday, May 17, 2024

TS | గంజాయి అక్రమ రవాణా దారుల అరెస్ట్.. 2 కిలోల గంజాయి స్వాధీనం

పెద్దపల్లి, (ప్రభ న్యూస్) : నిషేధిత గంజాయి రవాణా చేస్తున్న నలుగురిని పెద్దపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రైలు మార్గం ద్వారా గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు పెద్దపల్లి ఎస్ఐ మహేందర్, సిబ్బంది తో కలిసి పెద్దపల్లి రైల్వే స్టేషన్ ప్రాంతంలో అనుమానస్పదంగా ఉన్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోని తనిఖీ చేసి వారి వద్ద ఉన్న 2కిలోల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న పెద్దపల్లి పట్టణానికి చెందిన ఇంతియాజ్, గౌస్ ఖాన్, బండి సాయి, మిత్ర చైతన్యలను అదుపులోకి తీసుకున్నారు.

చెడు అలవాట్లకు, గంజాయి కి బానిసై గంజాయి తను తాగడం కోసం మరియు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదగించాలనే దురుదేశ్యంతో ఒక గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి పెద్దపల్లి ప్రాంతంలోని అమాయకపు స్టూడెంట్స్, యువత కి ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు నిందితులు తెలిపినట్లు ఎస్ఐ మహేందర్ పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై మహేందర్, కానిస్టేబుల్ శరత్ లను ఏసీపీ ఏడ్ల మహేష్, సీఐ అనిల్ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement