Thursday, May 2, 2024

ప్రతి నిత్యం వ్యాయామం తప్పనిసరి.. ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి : ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి నిత్యం తప్పనిసరిగా వ్యాయామం చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం విునీ ట్యాంక్‌ బండ్‌పై ఏర్పాటు చేసిన ఓపెన్‌ జిమ్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ… ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల శారీరక దారుఢ్యం పెంపొందుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వాకింగ్‌ అలవాటు చేసుకోవాలని, అందరికి అందుబాటులో ఉండేందుకు పట్టణంలోని మినీ ట్యాంక్‌ బండ్‌తోపాటు పలు ప్రాంతాల్లో ఓపెన్‌ జిమ్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ దాసరి మమత ప్రశాంత్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతితోపాటు కౌన్సిలర్లు, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement