Sunday, May 5, 2024

నిరుపేద ముస్లింలకు రూ.10 లక్షల సరుకుల పంపిణీ

రంజాన్ పవిత్రదినాన్ని పురస్కరించుకొని నిరుపేద ముస్లిం కుటుంబాలకు సురభి మెడికల్ కళాశాల యాజమాన్యం రూ.10 లక్షల రూపాయల నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. గురువారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎంబి గార్డెన్స్ లో ఇమామ్, మౌజంలతోపాటు ముస్లిం కుటుంబాలకు 25 కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సురభి మెడికల్ కళాశాల ద్వారా రెండవ సంవత్సరం రంజాన్ మాసంలో నిరుపేదలకు సరుకులు పంపిణీ చేశారు. ఎలాంటి స్వార్థం లేకుండా 10 లక్షల రూపాయల సరుకులు పంపిణీ చేసిన సురభి రామచందర్ రావు, హరేందర్ రావు, మహేందర్ రావు, విక్యాత్ రావు లను ముస్లిం మైనార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఏ హమీద్, మసూద్, జావిద్, అలీముద్దీన్, హాది, సబ్జాద్, మతిన్, ఆదిల్, జమీల్, జావిద్, వహీద్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement