Friday, May 17, 2024

ప్రజల ఇబ్బందులు తొలగించడమే లక్ష్యం

ప్రజల ఇబ్బందులను తొలగించడమే లక్ష్యమని పెద్దపల్లి మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ దాసరి మమత రెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని 5వ వార్డు పరిధిలో వాసవినగర్‌ శ్రీనివాస థియేటర్‌ లైన్‌లో రూ. లక్షతో చేపట్టిన కల్వర్టు నిర్మాణ పనులను చైర్‌ పర్సన్‌ మమతారెడ్డి ప్రారంభించారు. కల్వర్టు లేకపోవడంతో మురికి నీటి ప్రవాహానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మున్సిపల్‌ నిధులతో స్లాబ్‌ కల్వర్టును నిర్మించడం ద్వారా ప్రజల ఇబ్బందులు దూరమవుతాయన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా తెలిపాలని, వెంటనే పరిష్కరిస్తామన్నారు.క్ష్యం

Advertisement

తాజా వార్తలు

Advertisement