Tuesday, April 30, 2024

దళిత బంధు చారిత్రాత్మకం : పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం చారిత్రాత్మకమైనదని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామానికి చెందిన చుక్కా రాజమౌళికి దళిత బంధు ద్వారా మంజూరైన కార్ ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులను ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చేసేందుకు దళిత బంధు ప్రవేశపెట్టి ఒక యూనిట్ కు పది లక్షల రూపాయలు అందజేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీ రావు, సర్పంచ్ రమేష్, ఎంపీటీసీ సంపత్, ఉప సర్పంచ్ అరుణ-మొండయ్య, తిప్పారపు దయాకర్, బండారి శ్రీనివాస్, రాజమౌళి, కృష్ణారావు, వెంకట్రాజం, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement