Thursday, April 25, 2024

బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సీపీ సుబ్బారాయుడు

శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సీపీ సుబ్బారాయుడు పాల్గొని వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీపీ సుబ్బారాయుడుకు స్వామివారి తీర్థ ప్రసారదాలతో పాటు మెమోంటో అందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement