Monday, May 6, 2024

ఆలయాల అభివృద్ధికి సహకారం : ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి, (ప్రభన్యూస్‌): ఆలయాల అభివృద్ధికి తనవంతు సహకారం ఎళ్లవేళలా ఉంటుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పెద్దపల్లి పట్టణంలోని శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయంలో మడేలేశ్వరస్వామి విగ్రహానికి ఎమ్మెల్యే దాసరి సొంత ఖర్చులతో వెండి కిరిటాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రజకుల ఆరాధ్య దైవమైన మడేలేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, స్వామి దయతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రజకులతోపాటు అన్నివర్గాలకు తెలంగాణ ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. ఆలయాల అభివృద్ధి కోసం ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తుందన్నారు.

ఈకార్యక్రమంలో కౌన్సిలర్‌లు నాంసాని సరేష్‌, పోతాని పురుషోత్తం, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు బొడ్డుపల్లి రమేష్‌, రామ్మూర్తి, వెంకటేష్‌, శ్రీనివాస్‌, అశోక్‌, జగదీష్‌, నర్సయ్య, సంపత్‌ కుమార్‌, వెన్నం రమేష్‌, సోమ శ్రీకాంత్‌, పల్లె మధు, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement