Sunday, April 28, 2024

నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరం ఓ వ‌రం : దాసరి మమత

నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరంలా మారిందని పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమత ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇవ్వాల (ఆదివారం) పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 173 మంది లబ్ధిదారులకు 57,65,050 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ నిరుపేదలు అనారోగ్యాల బారిన పడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది సంబంధిత రసీదులతో దరఖాస్తు చేసుకుంటే సీఎంఆర్ఎఫ్ నుండి ఆర్థిక చేయూతని అందిస్తున్నామన్నారు.

- Advertisement -

నిరుపేదల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న దన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లు,జడ్పీటీసీ లు,మండల పార్టీ అధ్యక్షులు , సహకార సంఘం ఛైర్మెన్ లు, మార్కెట్ ఛైర్మెన్ లు, డైరెక్టర్ లు,పట్టణాధ్యక్షులు,అనుబంధ సంఘాల అధ్యక్షులు, గౌరవ కౌన్సిలర్ లు,సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, కో ఆప్షన్ లు,ఉప సర్పంచ్ లు, గ్రామ శాఖ అధ్యక్షులు,బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement