Tuesday, April 30, 2024

యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలే.. ప్రభుత్వ విప్​​ బాల్క సుమన్

చెన్నూర్ నియోజకవర్గం కోటపల్లి మండలంలో తుంతుంగ వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రభుత్వ విప్​, చెన్నూరు శాసనసభ్యుడు బాల్క సుమన్ ఆదేశించారు. శనివారం 8 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న బ్రిడ్జ్ పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే కోటపల్లి మండలంలోని ఏదులబంధం, సిర్సా, పుల్లగామ, రొయ్యల పల్లి, ఆల్గామా, జనగామ, వెంచపల్లి గ్రామ ప్రజల దశాబ్దాల పాటు పడ్డ కష్టాలు తొలగిపోతాయన్నారు. ఎమ్మెల్యే వెంట మంచిర్యాల ఎమ్మెల్సీతోపాటు ప్రజాప్రతినిధులు, టీఆర్ ఎస్ లీడ‌ర్లు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement