Sunday, May 19, 2024

అయ్యప్ప ఆలయ వార్షికోత్సవం..

మెట్‌పల్లి: పట్టణంలోని అయ్యప్ప దేవాలయ 25వ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా ఆలయంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు దంపతులు హోమం నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వామి పంచామృత అభిషేకం ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక పూజలలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ రానావేణి సుజాత సత్యనారాయణ దంపతులు కూడా పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో జెడ్‌పిటిసి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ మారు సాయిరెడ్డి, దేవాదాయ కమిటీ- ఉపాధ్యక్షులు గంగుల దేవరాజు, కాటి పెళ్లి ఆదిరెడ్డి, మర్రి నందకిషోర్‌, నారాయణస్వామి, పుల్ల చిన్నయ్య, శివకుమార్‌, రాజు, శేషు, మాడిశెట్టి ప్రభాకర్‌, గోపి, కౌన్సిలర్స్‌, వ్యాపారవేత్తలు, నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement