Friday, April 26, 2024

పెద్దపల్లికి అత్యాధునిక అంబులెన్స్ – .. మంత్రి కొప్పుల ఈశ్వర్

పెద్దపెల్లి జిల్లా కు మరో అత్యాధునిక అంబులెన్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శనివారం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంపీ లాడ్స్ నుండి గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా మంజూరైన అంబులెన్స్ ను ప్రారంభించారు. ప్రజలకు అత్యవసర సమయాల్లో ఆంబులెన్స్ ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో లో జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, డిసిపి రవీందర్, జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్, ఆసుపత్రి సూపర్డెంట్ వాసుదేవ రెడ్డి, ఏసీపీ నితికా పంత్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement