Tuesday, April 30, 2024

జర్నలిస్టుల సంఘం భవనానికి స్థలం కేటాయింపు.. కరీంనగర్ లో సంబరాలు

తెలంగాణ జర్నలిస్టుల చిరకాల స్వప్నమైన జర్నలిస్టుల సంఘం భవనానికి హైదరాబాద్ మహా నగరంలో స్థలాన్ని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేయడంపై హర్షం వ్యక్తం అవుతోంది. ఇవ్వాల (గురువారం) తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వ‌ర్యంలో సీఎం కేసీఆర్ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేశారు. హైదరాబాద్ లోని ఉప్పల్ భగాయత్ లో 2వేల చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేయడం తెలంగాణ జర్నలిస్టులకు గర్వ కారణం అని జ‌ర్న‌లిస్టు సంఘం నేత మ‌ల్లికార్జున్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement