Friday, May 17, 2024

పునరావాస కేంద్రాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్

పెద్దపల్లిరూరల్ : పెద్దపల్లి మండలం అప్పన్నపేటలో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన వరద బాధితుల పునరావాస కేంద్రాన్ని గురువారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. గ్రామంలో వరద నీటి పరిస్థితిని ఆరా తీశారు. కేంద్రంలో ఆశ్రయం పొందుతున్నవారితో మాట్లాడారు. వసతులపై అడిగి తెలుసుకున్నారు. ఇండ్లలోకి వరద నీరు చేరకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాజు, ఎంపీఓ సుదర్శన్, సర్పంచ్ చీకటి స్వరూపపోచాలు, ఉపసర్పంచ్ బొండ్ల శ్రీనివాస్,విజయరావు, పంచాయితీ కార్యదర్శి,గ్రామస్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement