Monday, April 29, 2024

కేటీఆర్ ను కలిసిన కరీంనగర్ జిల్లా నూతన అధ్యక్షుడు

కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా ఎంపికైన జివి రామకృష్ణారావు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ను కలిసారు. శుక్రవారం ఉదయం మంత్రి గంగులతో కలిసి మంత్రి కేటీఆర్ ని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ నూతన అధ్యక్షునికి అభినందనలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు, సమర్థుడైన మంత్రి గంగుల కమలాకర్ రూపంలో అండగా ఉన్నారని, సుశిక్షితులైన కార్యకర్తలతో కరీంనగర్ గులాబీ సేన పటిష్టంగా ఉందని రాబోయే రోజుల్లో పార్టీ కోసం మరింత తీవ్రంగా శ్రమించి అప్రతిహత విజయాల్ని అందుకోవాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి గంగుల.. కరీంనగర్ జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కేటీఆర్ కి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కరీంనగర్ కు అండగా ఉన్నారని, టిఆర్ఎస్ ప్రభుత్వంలో కరీంనగర్ అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement