Saturday, May 4, 2024

సమస్యలను వెంటనే పరిష్కరించండి: కలెక్టర్ ఆదేశం

డయల్ యువర్ కలెక్టర్ కు ప్రజలు తెలిపే సమస్యలను ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ దూర ప్రాంతాల నుండి జిల్లా కేంద్రానికి రాలేని ప్రజలు తమ  సమస్యల పరిష్కారానికి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని వినియోగించుకుంటున్నారని తెలిపారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి వచ్చిన ప్రజాసమస్యలు పెండింగ్ లో పెట్టకుండా వెంట వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వివిధ కార్యాలయాలకు సంబంధించి కోర్టులో పెండింగ్ లో వున్న కేసులకు వెంటనే కౌంటర్ ఫైల్ దాఖలు చేయాలని అధికారులకు సూచించారు. కౌంటర్ ఫైల్ దాఖలు చేయని అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కర్ణన్ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement