Friday, May 3, 2024

Karimnagar – కుక్కను తప్పించబోయి డివైడర్ ను ఢీకొన్న కారు … ఒకరి మృతి..నలుగురికి గాయాలు

కరీంనగర్ : కరీంనగర్ లోని గోదావరిఖని బైపాస్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాదు నుండి కరీంనగర్ కు వస్తున్న కారుకు కుక్క అడ్డు రావడంతో కంట్రోల్ తప్పిన వాహనం డివైడర్ కు ఢీకొట్టింది. దీంతో ఒకరు మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కరీంనగర్లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. కరీంనగర్ లోని డాక్టర్ స్ట్రీట్ కు చెందిన వారుగా తెలుస్తుంది విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement