Thursday, May 2, 2024

రైతులా మారి ..రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న కేఏపాల్

మునుగోడు ఉప ఎన్నికల వేళ మళ్లీ జనాల్లోకి వచ్చారు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు..కేఏపాల్. మునుగోడు ఉప ఎన్నికల్లో నిలబడి వినూత్న.. వింత వింత ప్రచారాలతో ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ని పంచుతున్నారు. మునుగోడులో గెలిచేది నేనే అంటూ కేఏ పాల్ చేస్తున్న ప్రచారం రియల్ కామెడీని తలపిస్తోంది. కాగా తాజాగా రైతులాగా మారిపోయాడు కేఏపాల్. తలకు కండువా చుట్టుకొని.. రైతులా చేతిలో కర్ర పట్టుకొని ..రైతులతో కలిసి పత్తి చేనులో దిగి పనిచేస్తూ పనివారితో ముచ్చటించాడు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తన మాటలతో నవ్వించాడు. రైతు సమస్యలను పరిష్కరిస్తానని.. కేసీఆర్ కు ఓటు వేయవద్దని.. కాంగ్రెస్.. బీజేపీ చేసేది ఏమీలేదని.. ప్రజలంతా ధర్మం వైపు ఉంటున్న తనకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. మునుగోడులో తనను గెలిపిస్తే అమెరికాలా అభివృద్ధి చేస్తానన్నారు. యువతకు ఉద్యోగాలిస్తానని హామీ ఇచ్చారు. ఇన్ని వేషాలు వేస్తూ.. అందరికంటే భిన్నంగా ఓటర్లను ఆకట్టుకుంటున్న పాల్ కు ఏ మాత్రం ఓట్లు పడతాయో చూడాలి మరి.

Advertisement

తాజా వార్తలు

Advertisement