Sunday, May 5, 2024

ఘనంగా కాకతీయ సేవా సమితి కేలండర్ ఆవిష్కరణ

మణికొండ కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో నూతన సంవత్సర కేలండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మణికొండ కాకతీయ సేవా సమితి తొలిసారిగా కేలండర్ తీసుకురావటంపై వక్తలు అభినందించారు. ఈ కేలండర్ ఆవిష్కరణకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌, తెలంగాణ కమ్మ సంఘాల సమైక్య అధ్యక్షుడు అరెకపూడి గాంధీ, తెలంగాణ కాంగ్రెస్‌ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ జెట్టి కుసుమ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు ముఖ్య అతిథులుగా హాజరై కేలండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న అరెకపూడి గాంధీ మాట్లాడుతూ… ఈ నూతన సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. జెట్టి కుసుమ కుమార్ మాట్లాడుతూ.. ఈ క్యాలెండర్‌ ఆవిష్కరణకు హాజరుకావడం సంతోషకరంగా ఉందన్నారు. కాకతీయ సేవా సమితి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ సందర్బంగా మణికొండ మున్సిపాలిటీ ఎన్నికలో గెలుపొందిన కౌన్సిలర్ కమ్మ నాగలక్ష్మి, వల్లభనేని హేమాంజలి, ఆలస్యం నవీన్ లను సన్మానించటం జరిగింది. కమ్మ సామాజికవర్గంలోని వివాహాలతో పాటు, పేదరికంతో చదువుకోలేకపోతున్న కమ్మ విద్యార్థులకు, అనారోగ్యంతో ఉన్న పేదవారికి ఆర్థిక సాయం అందజేస్తున్నామని ప్రెసిడెంట్‌ కమ్మ బ్రహ్మాజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రెసిడెంట్‌ జగదీష్, ప్రత్తిపాటి మాల్యాద్రి, వీరగంధం బద్రీనాథ్‌, వాసిరెడ్డి నరేష్‌, తుబాటి శివశంకర్‌, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement