Sunday, May 5, 2024

ముగిసిన కబడ్డీ టోర్నమెంట్.. భీమారం జట్టుకు ఫస్ట్ ప్రైజ్

భీమారం, (ప్రభ న్యూస్): గ్రేటర్ వరంగల్ పరిధిలోని 55వ డివిజన్ భీమారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గడ్డం ఫౌండేషన్ చైర్మన్ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ టోర్నమెంట్ శుక్రవారంతో ముగిసింది. ఈ కబడ్డీ టోర్నమెంట్ లో హసన్ పర్తి మండలంలోని పలు పాఠశాలల క్రీడాకారులు ఐదు టీమ్ లు పాల్గొన్నాయి. బాలుర , బాలికల విభాగంలో భీమారం ప్రభుత్వ పాఠశాలకు చెందిన జట్లు ప్రథమ బహుమతి గెలుచుకోగా మాస్టర్ మైండ్ పాఠశాలకు చెందిన క్రీడాకారులు ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు.

గెలుపొందిన క్రీడాకారులకు డివిజన్ కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర్లు ముఖ్య అతిధి గా పాల్గొని మెమెంట్లను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రదానోపాధ్యాయులు సంధ్య శ్రీ,వాసు రెడ్డి,సీనియర్ కబడ్డీ క్రీడాకారులు చెట్లపల్లి లింగమూర్తి,గుండెబోయిన శ్రీనివాస్,పీ.ఈ.టి లు… తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement