Friday, May 3, 2024

టీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలపై హైకోర్టులో కేఏ పాల్‌ పిటిషన్‌.. రూల్స్​కి విరుద్ధమని కంప్లెయింట్​

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్‌ నగరంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ప్రజా శాంతి పార్టీ ఫౌండర్‌ కేఏ పాల్‌ హైకోర్టులో బుధవారం పిటిషన్‌ దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు మంగళవారం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఉత్తర్వులను టీఆర్‌ఎస్‌ పార్టీ ఉల్లంఘించిందని పాల్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవి తొలగించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. క్లాసిఫైడ్స్‌తో ప్రచారం చేసుకోవడం తప్పుకాదని, కానీ రోడ్డు మధ్యలో ఫెక్సీలు పెట్టడం తప్పని పిటిషనర్‌ పేర్కొన్నారు. రోడ్లపై ఫెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని హైకోర్టును కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement