Monday, April 29, 2024

MBNR: స్వచ్ఛ భారత్ లో పాల్గొన్న న్యాయమూర్తులు

గద్వాల (ప్రతినిధి) అక్టోబర్ 2 (ప్రభ న్యూస్) : గాంధీ జయంతిని పురస్కరించుకొని హైకోర్టు ఆదేశానుసారం సోమవారం గద్వాల కోర్టు ఆవరణలో స్వచ్చ భారత్ దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.కుషతో పాటు న్యాయమూర్తులు కోర్టు ఆవరణలో పరిసరాలను, అదేవిధంగా కోర్టు ఆవరణలో న్యాయమూర్తులు మొక్కలు శుభ్రం చేసి మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి పి.అనిరోజ్ క్రిష్టియన్, అదనపు సీనియర్ సివిల్ జడ్జి జి.ప్రభాకర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నేరెళ్ళ వెంకట హైమ పూజిత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, కార్యదర్శి ఆది మల్లారెడ్డి, సీనియర్, న్యాయవాదులు, న్యాయ కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement