Sunday, May 5, 2024

Exclusive | ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో ప్ర‌స‌వించిన జడ్జి.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన న్యామూర్తి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా హాస్పిట‌ల్‌లో వేములవాడ జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి జ్యోతిర్మయి పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. హైదరాబాద్‌కు చెందిన జ్యోతిర్మయి ఈ మ‌ధ్య‌నే వేములవాడకు బదిలీపై వెళ్లారు. మంగళవారం వరకు ఆమె కోర్టు డ్యూటీలోనే ఉన్నారు. బుధవారం ఒక్క‌సారిగా పురిటినొప్పులు రావడంతో స్థానికంగా ఉన్న ప్ర‌భుత్వ‌ ఏరియా దవాఖానలో చేరారు. డాక్ట‌ర్ చైతన్య సుధా ఆమెకు సాధారణ ప్రసవం చేయగా, ఆడ శిశువుకు జన్మనిచ్చారు.

కాగా, తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని డాక్ట‌ర్‌ తెలిపారు. దవాఖానలో మొదటి కాన్పులో భాగంగా ఆడ శిశువుకు జన్మనిచ్చిన తల్లికి ఉయ్యాలను బహుమతి ఇస్తున్నామని, న్యాయమూర్తికి సైతం అందజేసిన‌ట్టు దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రేగులపాటి మహేశ్‌రావు తెలిపారు. దవాఖానలో అందుతున్న వైద్య సేవలపై న్యాయమూర్తి ఎంతో సంతృప్తి చెందారని ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement