Saturday, April 27, 2024

తెలంగాణలో కూడా జనసేనాని పవన్​ కల్యాణ్​ పర్యటన: నాదెండ్ల మనోహర్‌

అమరావతి, ఆంధ్రప్రభ: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ త్వరలోనే తెలంగాణ ప్రాంతంలో పర్యటిస్తారని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ- ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు క్రియాశీలక జనసైనికుల కుటు-ంబాలను పరామర్శించి, ఆర్థిక సాయం చెక్కులు అందిస్తారని వెల్లడించారు. హైదరాబాద్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఉదయం తెలంగాణ నాయకులు, వీరమహిళలతో ఆయన సమావేశమయ్యారు. మనోహర్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతమన్నా, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలన్నా అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌కు చాలా మక్కువని, ఈ ప్రాంత పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రతి సమావేశంలో ఆయన ప్రస్తావిస్తూనే ఉంటారని వివరించారు.

ఈ ప్రాంతంలో పేదరికం, వెనుకబాటుతనం, సమస్యలను స్వయంగా చూశారని, ఆదిలాబాద్‌, నల్గొండ, వరంగల్‌ జిల్లాల్లో తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితులు ఆయనకు తెలుసునని తెలిపారు. అందుకనే ఆదిలాబాద్‌ తండాలో అక్కడి మహిళలు అడగ్గానే మంచినీటి బోరు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కోరుకుంటే నాయకత్వం రాదని, దానికోసం మనస్ఫూర్తిగా కష్టపడాలని, ప్రణాళికతో వ్యూహాత్మకంగా ప్రజా సమస్యలపై గళం వినిపించాలని, అప్పుడు సమస్యలపై అవగాహన పెరగడంతో పాటు ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని దిశానిర్దేశం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement