Thursday, May 2, 2024

TS: బీజేపీ నేత శ్రీరాములు యాదవ్ ఇంట్లో ఐటి రైడ్స్​

హైదరాబాద్​లో మరోసారి ఐటీ రెయిడ్స్​ కలకలం రేపాయి. ఎల్బీనగర్​లోని బీజేపీ నేత శ్రీరాములు యాదవ్ ఇంట్లో ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీస‌ర్లు సోదాలు చేపట్టారు. ఉదయం నుంచి ఆయన నివాసంతో పాటు పీఏ ఇంట్లోనూ తనిఖీలు చేస్తున్నారు.

కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీరాములు యాదవ్ మహేశ్వరం నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీ లీడర్ ఇంట్లో ఐటీ దాడులు జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement