Wednesday, May 1, 2024

న‌వ వ‌ధువుకి క‌ష్టం.. బ‌ల‌వ‌న్మ‌ర‌ణం…

పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లికి వచ్చిన బంధువులు ఇంకా పెళ్లింటి నుంచి వెళ్లలేదు.. కాళ్లకు పెట్టిన పారాణి ఆరలేదు. అంతలోనే ఘోరం జ‌రిగింది. పేట్ బషీరాబాద్ పియస్ పరిది చింతల్ బాపు నగర్ లో నిషిత కుటుంబం నివాసం ఉంటుంది. నిషితకు (23) మేడ్చెల్ మండలం డబిల్ పురా గ్రామానికి చెందిన సంతోష్ రెడ్డితో సంబంధం కుదిరింది. కుటుంబ సభ్యులు ఇద్దరిని చూసి చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇద్దరు చూడముచ్చటైన జంట అని బంధువులు పొగడ్తలతో ముంచెత్తారు. ఇద్దరి వివాహానికి ముహూర్తం పెట్టారు. మే 5న పెళ్ళికి ముహూర్తం ఖరారైంది. అందరి బంధువులకు ఆహ్వానాలు వెళ్లాయి. దీంతో పెళ్లికి అందరు బంధువులు వధువు ఇంటికి వచ్చారు. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. వధువును తీసుకుని అత్తింటి వారు ఇంటికి వెళ్లారు. 16వ రోజు పండక్కు పుట్టింటికి వచ్చిన నవ వధువు నిషిత కుటుంబ సభ్యులను చూసి చాలా ఆనందంగా గడిపింది. తరువాత ఏం జరిగిందో ఏమో గానీ.. గదిలోకి వెళ్లిన నిషిత ఎంతసేపైనా బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపులు కొట్టినా నిషిత నుంచి ఎలాంటి సమాధానం లేదు.

దీంతో తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లి చూడగా.. నిషిత ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిషితను కిందికి దించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అత్తింటి వారు వేధించడం వల్ల‌నే నిషిత ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పెళ్లి జరిగి 16 రోజులు కూడా కాలేదని, అత్తింటికి వెళ్లి 16వ రోజు పండక్కి వచ్చిన నిషిత అసలు త‌మతో సరిగ్గా మాట్లాడలేదని తెలిపారు. ఆనందంగానే నిషిత ఉందని భావించామని, ఇంతలోనే ఆత్మహత్యకు పాల్పడించదని వాపోయారు. నిషిత ఆత్మహత్యకు కారకులైన అత్తింటి వారిపై కఠిచర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement