Friday, April 26, 2024

సమస్యలను ప‌రిష్క‌రిస్తామ‌న్న క‌మిష‌న‌ర్ శంక‌ర‌య్య

బాచూపల్లి, (ప్రభ న్యూస్): నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 7, 8, 28 డివిజన్లలో కమిషనర్ శంకరయ్య పర్యటించారు. స్థానికంగా డ్రైనేజ్ పైప్ లైన్, స్ట్రామ్ వాటర్ లైన్, బాక్స్ నాలా నిర్మాణ పనులను, శ్రీనివాస్ నగర్ పార్క్ పెండింగ్ పనులను డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్లు ప్రణయ ధనరాజ్ యాదవ్, సురేష్ రెడ్డిలతో పర్యవేక్షించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ… డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు సూచించిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు.

అనంతరం డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ మాట్లాడుతూ… నిజాంపేట్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, డివిజన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి శాయా శక్తులా కృషి చేస్తానని పేర్కొన్నారు. అదేవిధంగా పైప్ లైన్, ఓపెన్ నాలా పనుల్లో జాప్యం లేకుండా, త్వరితగతిన సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, కాంట్రాక్టర్, ఎన్ ఎమ్ సి అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వెంగయ్య చౌదరి, ఎన్ ఎమ్ సి తెరాస పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ హరి, సంయుక్త కార్యదర్శి కుమార్ రెడ్డి, ఎన్ ఎమ్ సి డీఈ సుదర్శన్ రావు, దాస్అయ్య వర్క్ ఇన్ స్పెక్టర్ విష్ణు, రాహుల్, 191 ఎన్టీఆర్ తెరాస పార్టీ అధ్యక్షులు మంజునాథ్, ఎన్టీఆర్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ కృష్ణ, శ్రీనివాస్ రెడ్డి,14వ డివిజన్ అధ్యక్షులు బోబ్బా శ్రీను, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement