Monday, April 29, 2024

పీవోని కలిసిన రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరి బాయి

ఉట్నూర్, జులై 6 (ప్రభ న్యూస్) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ నూతన పీవో గా నియమితులైన చహత్ బజ్పాయ్ ను గురువారం తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరి బాయి ఉట్నూర్ లోని పీవో కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు. గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అమలయ్యేలా కృషి చేయాలని పీవోకు విన్నవించారు. ఈ సందర్భంగా పీవో చాహత్ బాజ్పాయ్ గిరిజన అభివృద్ధికి కృషిచేస్తానని, గిరిజనులకు అమలయ్యే పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా కృషిచేస్తానని హామీ ఇచ్చినట్లు కమిషన్ సభ్యురాలు ఈశ్వర్ భాయి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement