Thursday, May 2, 2024

Invitation – గ్లోబ‌ల్ పీస్ స‌ద‌స్సుకు రండి …రేవంత్ కు కె ఎ పాల్ ఆహ్వానం..

హైదరాబాద్ : జనవరి 30వ తేదీన హైదరాబాద్లో జరిగే గ్లోబల్ పీస్ సదస్సుకు హాజరు కావాలని రేవంత్ రెడ్డిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్ర‌ముఖ మ‌త ప్ర‌చార‌కుడు కె ఎ పాల్ ఆహ్వానించారు. ఇందుకు కావాల్సిన అనుమతులను మంజూరు చేయాల్సిందిగా పాల్ సీఎంను కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో క‌లుసుకున్న ఆయ‌న ఈ మేర‌కు విజ్ఞ‌ప్తి చేశారు. అనంత‌రం పాల్ మీడియాతో మాట్లాడుతూ, త‌న ఆహ్వానానికి సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ ప్రపంచ శాంతి సదస్సుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు నాయకులను ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. ఈ సదస్సుకు పలు దేశాల నుంచి వేల మంది హాజరవుతున్నట్లు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement