Friday, May 3, 2024

ప్రియాంక స‌మ‌క్షంలో కాంగ్రెస్‌లోకి.. పార్టీ మారిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. జెడ్పీ చైర్మన్ అయిన తన సతీమణి భాగ్యలక్ష్మితో కలిసి ఇవ్వాల ఢిల్లీకి వెళ్లారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి ఉదయాన్నే ఢిల్లీకి వెళ్లిన ఓదెలు.. ఏఐసీసీ కార్యాలయంలో కాసేపటి క్రితం పార్టీ ముఖ్య నేత ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కాగా, ఓదెలు 2009, 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్‌ తరఫున పోటీచేసి విజయం సాధించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2010లో జరిగిన ఉప ఎన్నికలోనూ పోటీచేసి గెలుపొందారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రభుత్వ‌ విప్‌గానూ ఓదెలు పనిచేశారు. ఇక ఓదెలు భార్య భాగ్యలక్ష్మికి జడ్పీఛైర్‌పర్సన్‌ పదవీకాలం ఇంకా రెండేళ్లకు పైనే ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement