Friday, April 26, 2024

8న కేయూలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు : మంత్రి సత్యవతి రాథోడ్

హన్మకొండ: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఈనెల 8వ తేదీన హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ లోని ఆడిటోరియంలో నిర్వహిస్తున్నామని రాష్ట్ర స్త్రీ శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం హన్మకొండ కలెక్టరేట్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. నగర మేయర్, స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులు అందరం కలిసి ముందుకు పోయి సమిష్టిగా విజయవంతం చేస్తామని చెప్పారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ హాజరవుతున్నారని తెలిపారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 25 మహిళలను గుర్తించి వారికి రూ. లక్షా బహుమతితో పాటు ఘనంగా సన్మానం చేస్తామని మంత్రి సత్యవతి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement