Monday, April 29, 2024

TS : ఇంట‌ర్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదని… విద్యార్ధినీ ఆత్మ‌హ‌త్య‌

ఇంట‌ర్ ఫ‌లితాలు ఇవాళ వెలువ‌డ్డాయి. చాలా మంది త‌క్కువ మార్కులు వ‌చ్చాయ‌ని, ఫెయ్యిల్ అయ్యామ‌ని మ‌న‌స్థాపానికి గురై త‌నువును చాలిస్తుంటారు. అలాంటి ఘ‌ట‌నే మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఇంట‌ర్ ప‌రీక్ష‌ల్లో ఫెయిల్ అవ‌డంతో తీవ్ర మ‌న‌స్థాపానికి గురై విద్యార్థినీ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది.

- Advertisement -

మంచిర్యాల‌కు చెందిన విద్యార్థినీ తేజ‌స్వీని ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రం ప‌రీక్ష రాసింది. కాగా, ఇవాళ ప‌రీక్ష ఫ‌లితాలు వ‌చ్చాయి. ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణ‌త సాధించ‌క‌పోవ‌డంతో తీవ్ర మ‌న‌స్థాపానికి గురైంది. ఈ క్ర‌మంలో విద్యార్థినీ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. దీంతో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement