Saturday, May 4, 2024

చేపల చెరువులో పురుగుల మందు, చేప‌లన్నీ మృతి.. గిట్ట‌నివారి ప‌నేనా?

చెన్నారావుపేట, (ప్రభ న్యూస్): వ‌రంగ‌ల్ జిల్లా చెన్నారావుపేట మండ‌లంలో గిట్ట‌ని వారు చేసిన ప‌ని.. చేప‌ల మృతికి కార‌ణ‌మ‌య్యింది. అమృతండాకి చెందిన బోడ నర్సింహ కోడిపుంజులకుంట శివారులోని త‌న‌కున్న 20 గంటల భూమిని చేపల చెరువుగా చేసి నాలుగేండ్లుగా చేపల పెంప‌కం చేప‌ట్టాడు. వాటికి త‌గిన ఆహారాన్ని అందిస్తూ కంటికి రెప్ప‌లా కాడుకుంటున్నాడు. కాగా, శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చేపల చెరువులో పురుగుల మందు పోసి చేపలు పట్టుకుని వెళ్లారు. మిగతా చేపలు చనిపోయి ఉన్నాయి.

అది చూసి బాధితుడు న‌ర్సింహ క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యాడు. సుమారు 50 వేల దాకా నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం త‌న‌ను ఆదుకోవాలని బాధితుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాడు. ఘటనా స్థలాన్ని టి.ఆర్.ఎస్. లీడ‌ర్ బోడ వెంకన్న పరిశీలించారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించగా దర్యాప్తు చేయ‌నున్న‌ట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement