Thursday, May 2, 2024

వైద్యుల నిర్లక్ష్యానికి పసికందు మృతి… బంధువుల ఆందోళ‌న‌

కరీంనగర్ మాత శిశు కేంద్రం ఆసుపత్రి లో వైద్యుల నిర్లక్ష్యానికి ప‌సికందు మృతి చెందింది. కరీంనగర్ కు చెందిన గోగుల కొండ రాజు శ్వేత దంపతులకు సోమవారం రాత్రి మగ శిశువు జన్మించింది. మంగళవారం తెల్లవారి చూసే సరికి శిశువు మరణించి ఉంది. మెడ పై గాట్లు ఉండటం, చెయ్యి వంచినట్టు ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. డెలివరీ సమయంలో కనీస జాగ్రత్తలు పాటించక పోవడంతో ఆరోగ్యం తో జన్మించిన బిడ్డ చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. బంధువులు ఆందోళనకు దిగారు. మాత శిశు కేంద్రంలో తరచు ఇలాంటి సంఘటనలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఈ సంఘటనపై దర్యాప్తు జరిపి డ్యూటీ లో ఉన్న వైద్యుల పై సిబ్బంది పై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనకు దిగారు

Advertisement

తాజా వార్తలు

Advertisement