Monday, April 29, 2024

న్యూయార్క్ లో మెట్ గాలా.. సంద‌డి చేసిన ఆలియా..ఈషా అంబానీ

న్యూయార్క్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్‌ ఈవెంట్ల మెట్‌ గాలా జ‌రుగుతుంద‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ షోలో ఇండియా నుంచి ఇప్పటి వరకు ప్రియాంక చోప్రా , దీపిక పదుకొణె , ఈషా అంబానీ తదితర నటీనటులు హాజరై సందడి చేశారు. ఈ ఏడాది కూడా మెట్‌ గాలా న్యూయార్క్‌ నగరంలో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. అంతర్జాతీయంగా జరిగే ఈ ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్‌ వేడుకలో ఈసారి బాలీవుడ్‌ నుంచి ఆలియా భట్ ‌, ఈషా అంబానీ తోపాటు గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా హాజరై సందడి చేశారు. ప్రఖ్యాత ఫ్యాషన్‌ డిజైనర్లు రూపొందించి దుస్తుల్లో రెడ్‌కార్పెట్‌పై హొయలు పోయారు. ఆలియా భట్‌ తెల్లటి స్లీవ్‌లెస్‌ గౌనులో మెరిసిపోగా.. ఈషా అంబానీ బ్లాక్‌ డ్రెస్‌లో సందడి చేశారు. ఇక ఈ వేడకలు బాలీవుడ్‌ నటి, గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా తన భర్త నిక్‌ జొనాస్ తో కలిసి హాజరయ్యారు. ఇద్దరూ వైట్‌ అండ్‌ బ్లాక్‌ కాంబినేషన్‌లో దుస్తులు ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. న్యూయార్క్ లోని మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్ లో ప్ర‌తి ఏటా ఈ వేడుకను నిర్వహిస్తుంటారు. ప్రపంచం నలుమూలల నుంచి బాగా పేరున్న అతికొద్దిమంది సెలబ్రిటీలు మాత్రమే ఈ గాలాకు హాజరై సందడి చేస్తుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement