Thursday, May 9, 2024

తెలంగాణ భ‌వ‌న్ లో గంగుల‌, జ‌డ్పీ కార్యాల‌యంలో చైర్ పర్సన్ విజయలు జాతీయ‌ ప‌తాక ఆవిష్క‌ర‌ణ

కరీంనగర్ రూరల్ మండలంలోని తీగల గుట్టపల్లి లో గల ఉత్తర తెలంగాణ భవన్ లో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఎగరవేశారు బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్.. అలాగే ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయంలో జరిగిన వేడుకలలో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు..

ఇక జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయములో చైర్ పర్సన్ జిల్లా ప్రజా పరిషత్ కనుమల్ల విజయ, జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు.. ఈ కార్యక్రమములో జడ్.పి.టి.సి సభ్యులు మానకొండూర్, గన్నేరువరం, కో ఆప్సన్ సభ్యులు మరియు టి. పవన్ కుమార్, ముఖ్య కార్యనిర్వహణ అధికారి, జిల్లా ప్రజా పరిషత్ కరీంనగర్ గ ఇంజనీరింగ్ అధికారులు, జిల్లా ప్రజా పరిషత్ పర్యవేక్షకులు మరియు జడ్పి సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement