Friday, May 3, 2024

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం… పంచాయతీ కార్మికులకు 5 లక్షల బీమా సదుపాయం…

హైద‌రాబాద్ – స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది… పంచాయతీ కార్మికులకు మరణిస్తే రూ. 5 లక్షల బీమా వర్తింపజేయాలని నిర్ణయించింది… ఈ మేరకు ఎలీస్ఐసీకి ప్రీమియం చెల్లించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది…ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 51 వేల మంది పంచాయతీ కార్మికులకు లబ్ధి చేకూరనుంది… పంచాయతీ కార్మికులు చనిపోతే అంత్యక్రియలకు ఇచ్చే మొత్తాన్ని సైతం పెంచారు… రూ.5 వేల నుంచి రూ.10వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది…

Advertisement

తాజా వార్తలు

Advertisement