Friday, May 3, 2024

TS | సీతమ్మపై అసభ్యకరపోస్ట్.. చర్యలు తీసుకోవాలి: సీపీకి ఎమ్మెల్యేల వినతి

నిజామాబాద్ ప్రతినిధి (ప్రభ న్యూస్): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్మూర్ నియోజకవర్గంలో ఓ యువకుడు శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రాముడిగా, అమిత్ షాను లక్ష్మణుడిగా చూయిస్తూ మధ్యలో సీతాదేవిని అసభ్యకరంగా పోస్ట్ చేయడంపై జిల్లాలో కలకలం రేపింది. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారిలు ఈ పోస్ట్ పై శనివారం సాయంత్రం సీపీ కార్యాలయంలో సీపీ కల్మేశ్వర్ ను కలిసారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీపీకి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ… యావత్ భారతదేశంలో సీతమ్మ దేవిని ఆరాధ్యంగా పూజిస్తామన్నారు. దేవతపై అసభ్యకరంగా పోస్టు చేసిన వారిని వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రధాని మోడీ, అమిషాలను రామలక్ష్మణ వేషధారణలో పోస్ట్ పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ వెనుక ఉన్న సూత్రధారులను, పాత్రధారులను పట్టుకొని తగిన శిక్ష‌ విధించే వరకు త‌మ పోరాటం ఆగదని హెచ్చరించారు. దమ్ము, ధైర్యం ఉంటే ఎన్నికల్లో రాజకీయాలుగా ఎదుర్కోవాలి.. కానీ దేవతామూర్తులను కించపరిచేలా ఇలా పోస్టులు పెట్టి రాజకీయం చేయొద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement