Monday, April 29, 2024

సిగరెట్స్‌లో .. సీక్రెట్స్‌.. యువతే లక్ష్యంగా డ్రగ్స్‌ మాఫియా

మహబూబ్‌నగర్‌, (ప్రభ న్యూస్‌) : ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉడుకు రక్తం ఆసరా చేసుకొని యువత లక్ష్యంగా డ్రగ్స్‌ మాఫియా సీక్రెట్‌ సిగరెట్స్‌ ను సిండికేట్‌ గా రహస్య స్థావరాలు సిద్దం చేసుకున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ఇటీవలే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరుసగా గంజాయి పొట్లాలు పట్టబడటం ఇందుకు ఉదాహరణ. ప్రస్తుతం పట్టణం , పల్లె తేడా లేకుండా గంజాయి , డ్రగ్స్‌ లాంటి నిషేదిత ప్రమాదకర పదార్థాలను అనుమానం లేకుండా సిగరెట్‌లో నింపి ముఠాలు గుట్టుచప్పుడు కాకుండా దందాను సాగిస్తున్నట్లుగా సమాచారం.

టీవలే మహబూబ్‌నగర్‌ పరిధిలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన యువకుడికి తరచూ దొరికే ప్రదార్థం దొరక్క పోవడంతో పిచ్చెక్కి పోయి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డట్టుగా తెలిసింది. .ప్రస్తుతం పట్టుబడుతున్న గంజాయితో పాటు పట్టపగలే అనుమానం లేని వ్యక్తులే దర్జాగా ద్విచక్ర వాహనాల్లో సరుకును సరఫరా చేస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. నిషేదిత మాదక ద్రవ్యాలు మహబూబ్‌నగర్‌ యువతను మసి చేస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు గట్టి నిఘా ఉంచి అనుమానిత వ్యక్తులను గుర్తించి వారి రక్త నమూనాలను తీసుకుంటే గాని అసలు గుట్టు రట్టవదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement