Monday, May 13, 2024

ఇల్లందుకుంటను టెంపుల్ సిటీగా మారుస్తా. ఎమ్మెల్సీ పాడి

ఇల్లందుకుంట : 20 ( ప్రభ న్యూస్ )అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం నుంచి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ వరకు, డి ఎం ఎఫ్ టి నిధులతో 43.24 లక్షల వ్యాయంతో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ కనుమల విజయ గణపతి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ తో కలిసి బుధవారం రాత్రి ప్రారంభించారు,

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి జరుగుతుందని కరీంనగర్ లోనే అపర భద్రాద్రిని టెంపుల్ సిటీగా రాబోయే కాలంలో యాదగిరిగుట్ట రీతిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు,

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఎంపీపీ సరిగోమ్ముల పావని వెంకటేష్, ఎంపిటిసి ఫోరమ్ అధ్యక్షుడు మోటపోతుల ఐలయ్య, సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కలాల రాజిరెడ్డి, పి ఎస్ సి ఎస్ వై చైర్మన్ కందాల కొమురెల్లి, తోపాటు ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement