Tuesday, May 7, 2024

RR: బీఆర్ఎస్ కు ఓటేస్తే మోసపోయినట్టే.. మాజీ మంత్రి ప్రసాద్ కుమార్

వికారాబాద్, నవంబర్ 17 (ప్రభ న్యూస్): అధికార బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే ప్రజలు మోసపోయినట్టేనని మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం దారుల్ మండలం కెరలి గ్రామంలో ఆయన పీసీసీ ప్రధాన కార్యదర్శి రఘువీరారెడ్డి, దారుర్ మండల పార్టీ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి, సీనియర్ నాయకులు గడిల మల్లారెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమంలో 1200మంది ప్రాణత్యాగాల కారణంగా చలించిన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటు వేయకుండా బీఆర్ఎస్ కు ఓటు వేసి తప్పు చేశారన్నారు. ప్రజలు మరోసారి మోసపోయేందుకు సిద్ధంగా లేరన్నారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటు వేసి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేలా చూడాలని ఆయన ఓటర్లను కోరారు. వికారాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనంద్ కేవలం మాటలకే పరిమితమయ్యారని, ఆయన చేసింది శూన్యమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement