Saturday, May 4, 2024

కష్టపడి చదివితే లక్ష్యాన్ని చేరుకుంటారు.. అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాన్ని చేరుకుంటారని పెద్దపెల్లి జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. గురువారం రాత్రి యూనిటీ హై స్కూల్ లో జరిగిన వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ టిడిపి విద్యా సంస్థలు గత 40 ఏళ్లుగా నాణ్యమైన విద్యను అందించి లక్షలాది మంది విద్యార్థులను ప్రయోజకులుగా మార్చారన్నారు. రాబోయే పరీక్షల కోసం విద్యార్థులు కష్టపడి చదివి అత్యధిక మార్కులు పొందాలన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివితే భవిష్యత్తులో ప్రయోజకులుగా మారతారనన్నారు. అనంతరం విద్యార్థులు వార్షికోత్సవ వేడుకల్లో హంగామా చేశారు. వేడుకల్లో ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమత, అజిజ్ పాటు అధ్యాపకులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement