Sunday, May 5, 2024

పార్టీ విధేయుడిగానే ఉంటా, కావాలనే కేసుల్లో ఇరికిస్తున్నారు.. బీజేపీ హైకమాండ్​కి రాజాసింగ్​ వివరణ

మత విశ్వాసాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న కారణంతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్​పై పోలీసులు పీడీ యాక్ట్​ నమోదు చేశారు. అయితే.. ఈ విషయంలో బీజేపీ హైకమాండ్ షోకాజ్ కూడా రాజాసింగ్​కు నోటీసులు జారీ చేసింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసి, వివరణ కోరింది. ఈ నోటీసులపై రాజాసింగ్ ఇవ్వాల రిప్లయ్​ ఇచ్చారు. ఈమేరకు ఆయన పార్టీ అధినాయకత్వానికి ఓ లేఖ రాశారు. తాను పార్టీ నిబంధనలు ఉల్లంఘించలేదని ఆ లేఖలో స్పష్టం చేశారు.

ఎవరినీ వ్యక్తిగతంగా దూషించలేదని రాజాసింగ్​ వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగానే తనపై కేసులు పెట్టి, జైలుకు పంపించారని ఆ లేఖలో తెలిపారు. ఎంఐఎంతో కలిసి టీఆర్ఎస్ మతరాజకీయాలు చేస్తోందని వివరించారు. హిందూ ధర్మం కోసం పోరాడుతున్నందునే తనను లక్ష్యంగా చేసుకున్నారని… ఎంఐఎం, టీఆర్ఎస్ నేతలు కుట్రపూరితంగా వ్యవహరించి తనపై 100 కేసులు పెట్టించారని వెల్లడించారు. పార్టీ నియమావళికి, సిద్ధాంతాలకు తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉండే వ్యక్తినని, ప్రజలకు, హిందువులకు సేవ చేయడానికి తనకు అవకాశం ఇవ్వాలని రాజాసింగ్ బీజేపీ హైకమాండ్ కు విన్నవించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement