Monday, April 29, 2024

నవ్య డెవలపర్స్ పై కొనసాగుతున్న ఐటీ దాడులు

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో రియల్ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్న నవ్య డెవలపర్స్, కన్స్ట్రక్షన్స్ సంస్థలపై రాష్ట్ర ఐటీ శాఖ రెండవ రోజు కూడా సోదాలు చేపట్టింది. పఠాన్ చేరు మండలంలోని ఇంద్రేశం, బీరంగూడ ప్రాంతాలలో నవ్య కార్యాలయాల్లో ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల నేపథ్య వివరాలను ఐటీ అధికారులు బయటకు వెల్లడించడం లేదు .

నవ్య క్రయవిక్రయాలలో తేడాలు మార్కెట్ రేటు కంటే తక్కువగా దస్తావేజులు చేయించారనీ అభియోగం ఉండగా ఇటీవల దాడుల్లో చిక్కిన HMDA డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించిన వివరాల  నేపథ్యంలో దాడులని సమాచారం. ఇదిలా ఉంటే  నవ్య డెవలపర్స్ పై  ఇన్కమ్ టాక్స్ అధికారులు రెండవ రోజు దాడులు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement