Friday, May 17, 2024

Adilabad | కొంగు పట్టి అర్ధిస్తున్నా… ఆదరించి గెలిపించండి : సుగుణ

జన్నారం, (ప్రభ న్యూస్) ఆడబిడ్డనూ .! కొంగు పట్టి అర్థిస్తున్న… ఆదరించి గెలిపించండి.! అభివృద్ధి చేసి చూపిస్తానని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ వేడుకున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని మందపల్లి గ్రామంలోని ఫంక్షన్ హాల్ లో (మంగళవారం) మధ్యాహ్నం మండల స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ…, తాను పల్లెల నుంచి వచ్చినాని, పల్లె జనం కష్టసుఖాలు తెలుసుఅని ఆమె అన్నారు.

తాను 1995 సంవత్సరంలో మండలంలోని మురిమడుగు నుంచి ఎంపీటీసీగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి పని చేసిన అనుభవం ఉందని, ఆ తర్వాత టీచర్ అయి ఉద్యోగరీత్యా టీచరుగా పనిచేసి మళ్లీ, ప్రజాసేవే ద్యేయంగా రాజకీయాల్లోకి వచ్చానని ఆమె అన్నారు. ఒక మహిళగా కాంగ్రెస్ పార్టీ తనను ఆదరించి ఎంపీ టికెట్ ఇచ్చిందని ఆమె తెలిపారు. పార్టీలకతీతంగా తనకు ఓట్లు వస్తాయని, ఇప్పటికీ అన్ని పార్టీల నుంచి తనకు చాలామంది టచ్ లో ఉన్నారని ఆమె స్పష్టం చేశారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బొజ్జు అన్నతో కలిసి తాను నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దానని ఆమె చెప్పారు.

ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు ఎం.రాజశేఖర్, సుభాష్ రెడ్డి, ఇసాక్, మోహన్ రెడ్డి, ఎం.రాజన్న, పంకజ, భూమన్న యాదవ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముజఫర్ అలీ ఖాన్, నేతలు సుధాకర్ నాయక్, పసివుల్లా, రియాజ్, లక్ష్మీనారాయణ, నందు నాయక్, సతీష్, అల్లం రవి, లక్ష్మణ్, లక్ష్మి,రాకేష్ అజ్మత్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement