Sunday, April 28, 2024

HZB Politics: గౌడ‌న్న‌ల స‌పోర్ట్.. గులాబీకేన‌ట‌..

Karimnagar: హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ ఎస్‌కు రోజురోజుకూ స‌పోర్ట్ పెరుగుతోంది. శనివారం వీణవంక మండలం మామిడాలపల్లిలో గీత కార్మికులు తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతు తెలిపారు. ఈ నెల 30న జరిగే ఉప ఎన్నికలో కారు గుర్తుకు ఓటు వేస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని, హుజురాబాద్ ప్రజలందరూ గులాబీ పార్టీ వైపే ఉన్నారన్నారు. ఉప ఎన్నికలో బిజెపికి భంగపాటు తప్పదని, గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయమైందన్నారు.

సంక్షేమ పథకాల అమలులో తమ ప్రభుత్వం దేశంలోనే నెంబ‌ర్ వ‌న్‌గా ఉందని, ప్రజలకు సీఎం కేసీఆర్‌పై అపార నమ్మకం ఉందన్నారు. కార్యక్రమంలో టీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో గౌడ కులస్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement