Sunday, May 19, 2024

TS : కారు గుర్తుకు ఓటు వేయాలి

బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విద్యా శాఖ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి కోరారు. కొత్తపేటలోని దయాకర్ రెడ్డి కాంప్లెక్స్ లోని మిత్ర ఫంక్షన్ హాల్ జరిగిన సమావేశంలో కాలనీల అసోసియేషన్లు సబితమ్మకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. కాలనీల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సబితా ఇంద్రారెడ్డి నే గెలిపించుకుంటామ‌నిఅన్నారు.

అనంత‌రం ఆమె మాట్లాడుతూ కాలనీల సంక్షేమానికి కృషి చేసానని,అందరి ఆశీర్వాదాలు కావాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే 400 కే గ్యాస్ అందిస్తారని అన్నారు.2 వేలు ఉన్న ఆసరా పెన్షన్లు 5 వేలు,4 వేలు ఉన్న వికలాంగుల పెన్షన్ 6 వేల వరకు పెంచబోతున్నట్లు తెలిపారు. మహిళలకు ప్రతి నెల సౌభాగ్య లక్ష్మీ పథకం ద్వారా 3 వేలు అందిస్తామని,రైతు భీమా లాగా 93 లక్షల తెల్ల రేషన్ కార్డు దారులకు భీమా సౌకర్యం కలిస్తామన్నారు.పక్కా రాష్టాల్లో విద్యుత్ కోతలు,తాగునీటి సమస్యలు ఉన్నా తెలంగాణలో వేసవిని కూడా వర్షాకాలంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement