Thursday, April 25, 2024

కాసోజు శ్రీకాంత్ చారికి నివాళుల‌ర్పించిన ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా

మలిదశ తెలంగాణ ఉద్యమ నేత కాసోజు శ్రీకాంత్ చారికి టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా నివాళులర్పించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి విద్యార్థి అమరుడు తన అమరత్వంతో యావత్ తెలంగాణలో రాష్ట్ర సాధనకై ముందడుగు వేసిన విద్యార్థి కీ.శే. కాసోజు శ్రీకాంత్ చారి 13వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎల్.బి.నగర్ లో విశ్వ బ్రాహ్మణ మనుమయ సంఘం-ఎల్.బి.నగర్ డివిజన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో కీ.శే. కాసోజు శ్రీకాంత్ చారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో.. సల్వ చారి, వెంకటేశ్వరాచారి, ఆందోల్ చారి, వెంకటాచారి శేఖరాచారి, రామాచారి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement