Friday, April 26, 2024

పేద అడబిడ్డ పెళ్లికి అండగా నిలిచిన ఉప్పల ఫౌండేషన్

ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయి పెళ్లికి ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళసూత్రం, మెట్టెలు, చీరె, గాజులు అందజేశారు. నల్లగొండ జిల్లా, కేశరాజు పల్లి గ్రామానికి చెందిన లింగంపల్లి సైదులు-వాహినిల కూతురు బీసీ-డి ముదిరాజ్ కమ్యూనిటీకి చెందిన అమ్మాయి శ్రీజ వివాహం కోసం ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని ఉప్పల శ్రీనివాస్ గుప్తా క్యాంప్ కార్యాలయానికి వచ్చి కలిసిన సందర్భంగా ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో..తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ అండ్ ఉప్పల ఫౌండేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా చేతుల మీదుగా మంగళ సూత్రం, మెట్టెలు, చీర, గాజులు విరాళంగా ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో.. పెళ్ళి కూతురు శ్రీజ తండ్రి, సైదులు, జె.సతీష్, యాదా నాగేశ్వర్ రావు వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ మాజీ ప్రెసిడెంట్, మహేష్ గుప్తా, ప్రెసిడెంట్ ఐవీఎఫ్ కామారెడ్డి జిల్లా, బాలు గుప్తా ఐవీఎఫ్ సేవాదళ్ చైర్మన్, మాతురి శ్రీకాంత్ టౌన్ వైశ్య సంగం ప్రెసిడెంట్ కామారెడ్డి, మొగిళ్లపల్లి భూమేష్ వైశ్య సంఘం సెక్రటరీ కామారెడ్డి, లక్ష్మిపతి (వ్యాపారం), త్రినాథ్ రావు (వాసవి కిరణాలు ఎడిటర్) తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement