Friday, September 20, 2024

పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఉప్పల ఫౌండేషన్ చేయూత

ఉప్ప‌ల ఫౌండేష‌న్ పేదింటి ఆడ‌బిడ్డ‌ల పెళ్లిళ్ల‌కు చేయూత‌నందిస్తోంది. ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని నాగోల్ లో ఉప్పల శ్రీనివాస్ గుప్తా నివాసంలో హైదరాబాద్ లోని నాగోల్, జైపూరి కాలనీకి చెందిన చిక్కుళ్ల శ్రీలత కూతురు ( చిక్కుళ్ల రమేష్ (లేటు)- శ్రీలతల కూతురు) బీసీ-ఏ కమ్యూనిటీకి చెందిన తండ్రి లేని ఆ పేద కుటుంబానికి చెందిన లక్ష్మీ ప్రసన్న వివాహం కోసం, అలాగే మహబూబాబాద్ జిల్లా, మండలం, దంతాలపల్లి, గ్రామం బీరిశెట్టిగూడెంకు చెందిన పేద కుటుంబం, ఎస్సీ కమ్యూనిటీ కి చెందిన మిడతపల్లి వెంకన్న- వీరమ్మ ల కూతురు సంధ్య వివాహం సందర్భంగా.. వచ్చి కలిశారు. అందులో భాగంగా వారి ఇద్దరి కుటుంబాల పరిస్థితి గమనించి, వారి ఆర్థిక ఇబ్బందులు తెలుసుకొని, ఇద్దరు ఆడబిడ్డల వివాహం కోసం.. ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్, ఉప్పల ఫౌండేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా చేతుల మీదుగా మంగళ సూత్రం, మెట్టెలు, చీర, గాజులు విరాళంగా అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో.. ఇద్దరు పెళ్లికూతుర్లు లక్ష్మీ ప్రసన్న, సంధ్య, వారితల్లులు శ్రీలత, వీరమ్మ, నాగోల్ టీఆర్ఎస్ లీడర్ మైల శ్రీను, యాది లాల్, నల్లరాజు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement