Monday, April 29, 2024

Union Minister: ధనుకా గ్రూప్ స్టాల్‌ను సందర్శించిన‌ నరేంద్ర సింగ్ తోమర్

హైదరాబాద్ : కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ హైదరాబాద్‌లో జరుగుతున్న జీ20 వ్యవసాయ మంత్రివర్గ సమావేశంలో ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్ స్టాల్‌ను సందర్శించారు. వ్యవసాయ రంగానికి గ్రూప్ అందిస్తున్న సహకారాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి కూడా పాల్గొన్నారు. స్టాల్‌ను సందర్శించిన సందర్భంగా తోమర్, కైలాష్ చౌదరి లు గ్రూప్ చైర్మన్ ఆర్ జీ అగర్వాల్‌తో వ్యవసాయ రంగంలో వివిధ అవకాశాలు, వ్యవసాయ రసాయన పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి సంభాషించారు. సదస్సు ప్రారంభ రోజున, ధనుకా గ్రూప్ ఏర్పాటు చేసిన స్టాల్‌ను వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి ప్రారంభించారు.

ఈ ఎగ్జిబిషన్ లో భాగంగా కంపెనీ తన వినూత్న ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్, డ్రోన్ టెక్నాలజీలు, వ్యవసాయం, అనుబంధ రంగాల్లో సాధించిన విజయాలను ప్రదర్శించింది. ఈ సందర్భంగా ధనుకా గ్రూప్ చైర్మన్ ఆర్ జీ అగర్వాల్ మాట్లాడుతూ… జీ20 అగ్రికల్చర్ మినిస్టీరియల్ మీటింగ్‌లో ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్ పాల్గొనడం, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంలో ప్రపంచ వాటాదారులతో కలిసి పనిచేయడానికి త‌మ నిబద్ధతను తెలియజేస్తోందన్నారు. ధనుకా వద్ద తాము రైతులతో సహా వివిధ వాటాదారులకు త‌మ నైపుణ్యం, వినూత్న పరిష్కారాలను పంచుకోవడం ద్వారా పర్యావరణ అనుకూల వ్యవసాయం, ఆహార భద్రత అభివృద్ధికి తోడ్పడేందుకు కృషి చేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement